ప్రభాస్ - కృతి సనన్ వ్యవహారం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
ప్రభాస్, కృతిసనన్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెండ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.
కృతిసనన్ నటించిన భేడియా తాజాగా విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్లో పాల్గొన్న కృతి చాలాసార్లు ప్రభాస్ పేరు ప్రస్తావించింది.
ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్, టైగర్ ష్రాఫ్, కార్తిక్ ఆర్యన్ లో ఎవరిని పెండ్లి చేసుకోవాలని అనుకుంటున్నవ్ అని అడగ్గా.. రెబల్ స్టార్ పేరు చెప్పింది.
ఈ వీడియో వైరల్గా మారడమే కాదు.. ప్రభాస్, కృతిసనన్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు మొదలయ్యాయి.
భేడియా ప్రమోషన్లో భాగంగా ఓ రియలిటీ షోలో వరుణ్ ధావన్ వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
నీ డేటింగ్ లిస్ట్లో కృతి సనన్ పేరు ఉందా అని వరుణ్ ధావన్ను కరణ్ జోహార్ ప్రశ్నించగా లేదని బదులిచ్చాడు.
అంతటితో ఆగకుండా కృతి మనసులో వేరే హీరో ఉన్నాడని వరుణ్ ధావన్ చెప్పుకొచ్చాడు.
అతను ఇప్పుడు ముంబైలో లేడని.. దీపికా పదుకొణెతో షూటింగ్లో ఉన్నాడని హింట్ ఇచ్చాడు. వరుణ్ వ్యాఖ్యలకు కృతి సనన్ సిగ్గుపడుతూ నవ్వేసింది.
ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కే చిత్రం కోసం ప్రభాస్, దీపిక కలిసి పనిచేస్తున్నారు.
దీంతో కృతి సనన్ మనసులో ప్రభాస్ ఉన్నాడని బీటౌన్లో వార్తలు జోరందుకున్నాయి.
ఇదిలా ఉంటే వివాదాస్పద విశ్లేషకుడు ఉమైర్ సంధు చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు వైరల్గా మారింది.
అఫిషియల్లీ కన్ఫార్మ్డ్ ! ఆదిపురుష్ షూటింగ్లో కృతిసనన్కు ప్రభాస్ ప్రపోజ్ చేశాడు. వాళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారు. త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారంటూ ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు.
ఉమైర్ సంధు ట్వీట్ను చాలామంది నమ్మడం లేదు.. ఇదంతా ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు.
మరి కృతిసనన్తో ప్రేమ వ్యవహారం నిజమో కాదో తెలియాలంటే ప్రభాస్ స్పందించాల్సిందే.