వరంగల్ : తెలంగాణ అకాడమీ ఫర్ స్కీల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సీఈవో శ్రీకాంత్ సిన్హా, ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి భధ్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం వారు ఆలయాన్ని సందర్శించగా ఆలయ ప్రధాన అర్చకులు శేషు ఆధ్వర్యంలో అర్చక బృందం పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆది శంకరాచార్యులు, వల్లభ గణపతిలను దర్శించుకున్న అనంతరం భద్రకాళీ అమ్మవారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహామండపంలో అమ్మవారి ప్రసాదాన్ని వారికి అర్చకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శేషు, టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హాకు ఆలయ చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ జిల్లా కో-ఆర్డినేటర్స్ మహ్మద్ జాఫర్, రవికిరణ్, డైరక్టర్ దొంతి రవీందర్రెడ్డి, మహేందర్, సుందర్రాజ్, మాడిశెట్టి శివశంకర్ పాల్గొన్నారు.