వరంగల్ సబర్బన్, ఏప్రిల్ 28: హన్మకొండ టీఎస్ ఎన్పీడీసీఎల్ కార్యాలయంలోని విద్యుత్ భవన్లో అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న జీ డేవిడ్రాజ్ మృతి విద్యుత్ శాఖకు తీరని లోటని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్రావు అన్నారు. విద్యుత్ భవన్లో బుధవారం డేవిడ్రాజ్ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డేవిడ్రాజ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ వివిధ హోదాల్లో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందిన వ్యక్తి డేవిడ్రాజ్ అన్నారు. ఆయన ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వెంకటేశ్వరరావు, గణపతి, మోహన్రెడ్డి, ప్రభాకర్, మోహన్రావు, సదర్లాల్, మధుసూదన్, తిరుపతిరెడ్డి, రవీంద్రనాథ్, జాయింట్ సెక్రటరీలు రమేశ్, గిరిధర్, శ్రీకృష్ణ, మనోహర్స్వామి, పీజీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హేమంత్కుమార్, జాయింట్ సెక్రటరీ రమణారెడ్డి, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.