మంత్రి సత్యవతి రాథోడ్
కాశీబుగ్గ, ఏప్రిల్ 24 : గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి తూర్పాటి సులోచనను అధిక మెజార్టీతో గెలిపించాలని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. శనివారం డివిజన్లోని బాలాజీనగర్లో ఇంటింటికీ తిరిగి టీఆర్ఎస్ పార్టీకే ఓటు వెయ్యాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. గతంలో కార్పొరేటర్గా తూర్పాటి సులోచన సారయ్య చేసిన అభివృద్ధిని చూసి, మళ్లీ ఓటుతో ఆశీర్వదించాలని కోరారు. విలీన గ్రామాల్లోని ఎనుమాముల ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత సులోచనకే దక్కుతుందన్నారు. పేదలు అధికంగా ఉన్న ఈ డివిజన్లో అనేక సంక్షేమ పథకాలను అర్హులైన పేద, మధ్యతరగతి ప్రజలకు సులోచన అందించారన్నారు. టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తూర్పాటి సారయ్య, పార్టీ డివిజన్ అధ్యక్షుడు ముడుసు నరసింహ, ప్రధాన కార్యదర్శి పత్రి సుభాష్, గండ్రా తి భాస్కర్, నాయకులు పత్రి రాజపోశాలు, సిలువేరు శ్రీనివాస్, కేతిరి రాజశేఖర్, మచ్చర్ల స్టాలిన్, పసులాది మల్లయ్య, జంగం రాజు, కొత్తపల్లి యాదగిరి, ఈర్ల కుమార్, కరంట్ నాగరాజు, భూక్య శంకర్నాయక్, తూర్పాటి పూర్ణచంద్, ప్రభాకర్, అఫ్జల్, సలీం పాల్గొన్నారు.