ఎమ్మెల్యే అరూరి రమేశ్
ఐనవోలు, మే 18 : కొవిడ్పై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. మండలంలోని కొండపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. దవాఖానల్లో అందుతున్న వైద్య సేవలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్లో ఇబ్బందులు లేకుండా చూడాలని వైద్యాధికారి సుభాష్కు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న వైద్యాధికారి సుభాష్ను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు. ఆయన వెంట మండల రైతుబంధు సమితి కో ఆర్డినేటర్ ఎం జయపాల్, సర్పంచ్ కే రాజమణి, సొసైటీ వైస్ చైర్మన్ ఎంబాబు, టీఆర్ఎస్ మండధ్యక్ష, కార్యదర్శులు పీ శంకర్రెడ్డి, ఎం రవీందర్, నాయకులు కే బెన్సన్, పీ సుధీర్, సతీశ్, ఎస్సై భరత్ తదితరులు ఉన్నారు.
కొవిడ్ బాధితులకు ఆత్మీయపలకరింపు..
ఐనవోలు/వర్ధన్నపేట : కొవిడ్ బాధితులు ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లోని గ్రామాల్లో కరోనా భారిన పడి ఇబ్బందులు పడుతున్న పలువురు పార్టీ నాయకులు, కా ర్యకర్తలకు ఎమ్మెల్యే అరూరి రమేశ్ మంగళవారం ఫోన్ చేసి, ఆత్మీయంగా పలకరించారు. వైద్యుల సలహాలు, సూచనలు పాటించీ, ధైర్యంగా ఉండాలని చెప్పారు. కొవిడ్ బాధితులు ప్రజాప్రతినిధులు, వైద్యుల సహకారం తీసుకోవాలని ఆయ న ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలను తెలిపారు. కాగా, ఎమ్మెల్యే రమేశ్ ఫోన్ చేసి పలకరించడంతో కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యుల్లో సంతోషం వ్యక్తం చేశారు.