కలెక్టర్ ద్వారా అందజేసిన ‘ఆటా’ సభ్యులు
హన్మకొండ, మే 17 : అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) సభ్యులు వరంగల్ ఎంజీఎం దవాఖానకు 12 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ యూనిట్లు అందజేశారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు చేతుల మీదుగా ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్కు ఆటా అధ్యక్షుడు భువనేశ్ బుజాల, సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా ఆటా సభ్యులు మాట్లాడుతూ.. ఆటా ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ర్టాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఏమైనా అవసరముంటే తమ దృష్టికి తీసుకొస్తే వాటిని తెప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని మొదట వరంగల్ నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం 24గంటలకు శ్రమిస్తుందన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచన మేరకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేసిన ఆటా సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్కుమార్, ఆటా సభ్యులు బొద్దిరెడ్డి అనిల్రెడ్డి, సుధీర్రెడ్డి, ఇండి యా ఆటా అడ్వయిజర్ లోహిత్కుమార్, మహిళా కో ఆర్డినేటర్ జోత్స్నారెడ్డి, బండారి శ్రీనివాస్, నవీన్కుమార్ పాల్గొన్నారు.