వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి
150 మంది యాచకులకు కరోనా నిర్ధారణ పరీక్షలు
హన్మకొండ సిటీ/వరంగల్ చౌరస్తా, మే17 : కరోనా కట్టడి ప్రతి పౌరుడి బాధ్యత అని, కొవిడ్ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి అన్నారు. సోమవారం వరంగల్ కమిషనరేట్, జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో వరంగల్ బస్టాండ్, హన్మకొండ పబ్లిక్గార్డెన్లో 150 మంది యాచకులకు కొవిడ్ పరీక్షలు చేశారు. అనంతరం వారికి పండ్లు, మాస్కులు అందజేసి భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. యాచకులకు కరోనాపై అవగాహన లేనందున మరింత విస్తరించే అవకాశం ఉందన్నారు. పాజిటివ్ వచ్చిన వారిని ఐసొలేషన్ కేంద్రాలకు తరలించి మెరుగైన వైద్యం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో యాకూబ్పాషా, హన్మకొండ, వరంగల్ ఏసీపీలు జితేందర్రెడ్డి, గిరికుమార్, ఇన్స్పెక్టర్లు రాఘవేందర్, రవికిరణ్, గణేశ్, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, హన్మకొండ ఎస్సై రవీందర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.