పరకాల/నర్సంపేట రూరల్/పర్వతగిరి/గీసుగొండ, మే 16 : కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో భాగంగా గ్రామాల్లో జోరుగా శానిటైజేషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పరకాల పట్టణంలోని పలు వార్డుల్లో ఆదివారం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ పిచికారీ చేశారు. ఒకటో వార్డులో కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ పర్యవేక్షించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే, నర్సంపేట మండలంలోని గుంటూరుపల్లి, పర్శనాయక్తండా, రాజుపేట, లక్నెపల్లి, ముగ్ధుంపురం, ముత్తోజిపేట, కమ్మపల్లి గ్రామాల్లో జీపీ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కార్యక్రమాలను సర్పంచ్లు కర్నాటి పార్వతమ్మ, బానోతు గాంధీ, దస్రూ, గొడిశాల రాంబాబు, పెండ్యాల జ్యోతి, రంగారెడ్డి, శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. పర్వతగిరి మండలంలోని జమాలపురం గ్రామంలో సర్పంచ్ పిడుగు రేణుక ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. గ్రేటర్ పరిధిలోని కీర్తినగర్ కాలనీలో బీజేపీ నాయకుడు గోదాసి చిన్న శానిటైజేషన్ పనులు చేయించారు. అలాగే, మొగిలిచర్ల గ్రామంలో కార్పొరేటర్ మనోహర్ ద్రావణం పిచికారీ చేయించారు.