ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
సీహెచ్సీలో ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటు పరిశీలనa కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
సీహెచ్సీలో ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటు పరిశీలన
పరకాల, మే 15 : కరోనా నియంత్రణకు ప్ర త్యేక చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటును డీఎంహెచ్వో మధుసూదన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా దవాఖానలో కరోనా వార్డు, ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటు అందుకు అవసరమైన అందుబాటులో ఉన్న ఆక్సిజన్ వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడంతో పాటు బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే ఎంజీఎం దవాఖానను కొవిడ్ దవాఖానగా మా ర్చి వైద్యం అందిస్తుందన్నారు. కాగా, క్షేత్ర స్థాయి లో మరింత ఎక్కువ మందికి వైద్య సేవలు అం దించేందుకు అన్ని ఆసుపత్రులలో వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులోభాగంగా పరకాలలోని సివిల్ దవాఖానలో కూడా కొవిడ్ సెంటర్ను ఇదివరకే ప్రారంభించగా, ఆక్సిజన్ బెడ్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. కొవిడ్ సెంటర్లో పూర్తి స్థాయిలో డాక్టర్లు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తారన్నారు. ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని. లాక్డౌన్ సమయంలో ప్రజలు బయటకు రావద్దన్నారు. లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రజలు గుంపులుగా రోడ్ల మీదకు రావద్దని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వచ్చేవారు తప్పకుం డా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ప్రజలు కరోనాపై భయాందోళనకు గురి కావద్దని పేర్కొన్నారు. హాస్పటల్ సూపరిండెంట్ ఆకుల సంజీవయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం
సంగెం: ప్రతి కార్యకర్త కుటుంబానికి టీఆర్ఎస్ అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని క్రిష్ణానగర్కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ముడుసు జగన్మోహన్రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, టీఆర్ఎస్ సభ్యత్వం ఇన్సూరెన్సు ద్వారా మంజూరైన 2లక్షల చెక్కును శనివారం బాధిత కటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హన్మకొండలోని తన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదవశాత్తు కార్యకర్త అకాల మరణం చెందితే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడకుండా పార్టీ సభ్యత్వ న మోదులో రూ. 2లక్షల ఇన్సూరెన్సు చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ గ్రేన్ మార్కెట్ చైర్మన్ చింతం సదానందం, బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు.