డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటుతో మరో ముందడుగు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
జనగామలో డయాగ్నస్టిక్ కేంద్రం ప్రారంభం
జనగామ, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటు వైద్య చరిత్రలో మరో ముందడుగని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం ఆయన జనగామ జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో డయాగ్నస్టిక్ సెంటర్ను జనగామ, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ టీ రాజయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, కలెక్టర్ నిఖిల, డీసీపీ శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. వైద్య పరీక్షల విధానం, ఫలితాల వెల్లడి, యంత్రాల పనితీరు వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్న జనగామలోని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం, యశ్వంతాపూర్ వద్ద నిర్మిస్తున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని (తెలంగాణ భవన్) పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైద్యారోగ్యశాఖలో ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక మార్పులతో సర్కారు దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. చికిత్స కోసం దవాఖానకు క్యూ కడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో పైసా ఖర్చు లేకుండా హార్ట్, కిడ్నీ, బ్రెస్ట్ క్యాన్సర్, షుగర్, లిపిడ్ ప్రొఫైల్ వంటి 57 రకాల టెస్టులు నిర్వహించేలా 19 జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో డయాగ్నస్టిక్ కేంద్రాలు ప్రారంభమైనట్లు చెప్పారు.
నెలాఖరులో కలెక్టరేట్,
టీఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవం..
ఈ నెలాఖరులో జనగామ కలెక్టరేట్ సముదాయం, టీఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమాలుంటాయని మం త్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించి న అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21న వరంగల్ కలెక్టరేట్ ప్రారంభోత్సవం, పాత సెంట్రల్ జైలు ఆవరణలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన ఉంటుందన్నారు. పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తే ఈ నెలాఖరులో జనగామ కలెక్టరేట్ సహా టీఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవం ఉంటుందని చెప్పారు.