పరకాల, మే14: పట్టణంలోని సివిల్ దవాఖానలో నేటి నుంచి 10 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. అందులో భాగంగానే ముందస్తుగా పరకాల సివిల్ దవాఖానలో 10 ఆక్సిజన్ బెడ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మెరుగైన చికిత్స అందించేందుకు మరిన్ని సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. నియోజకవర్గ ప్రజలు కరోనాపై అప్రమత్తంగా ఉండాలని, వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే అవసరమైన మందులు వాడాలన్నారు. తగ్గకపోతే దగ్గర్లోని పీహెచ్సీకి వెళ్లి వైద్యసేవలు పొందాలని సూచించారు. ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, కలెక్టర్ హరితకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.