వరంగల్, జూన్ 13 : వరంగల్ మహా నగరపాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి బదిలీ అయ్యారు. యాదాద్రి భవనగిరి జిల్లా కలెక్టర్గా ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2015 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన పమేలా సత్పతి 2019 డిసెంబర్ 24న గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. సుమారు 18 నెలలు గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్గా విధులు నిర్వర్తించారు. కాగా, గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్గా ప్రభుత్వం ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. ఒకటి రెండు రోజుల్లో కమిషనర్ను నియమించే అవకాశాలు ఉన్నాయి. ఏడాదిన్నర కాలం పనిచేసిన సత్పతి సక్సెస్ కమిషనర్గా పేరు సంపాదించారు. కరోనా కష్టకాలంలో సమర్థవంతంగా పనిచేశారు. దీంతో పాటు గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ నగరాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లారు.