వరంగల్ సీపీ తరుణ్జోషి
పోచమ్మమైదాన్/హన్మకొండ సిటీ, మే 12: లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇంటి వద్ద సేఫ్గా ఉండా లని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నా రు. నగరంలో పలు చోట్ల పోలీసుల తనిఖీలను పరి శీలించారు. రాత్రి 10 గంటల తర్వాత కూడా పర్య వేక్షించి నాలుగు ద్విచక్ర వాహనాలతోపాటు ఓ కారును సీజ్ చేశారు. కారణం లేకుండా వాహనాలపై సంచరి స్తున్న వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇ చ్చారు. గుర్తింపు కార్డులు లే కుండా బయటికి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిం చారు. ఉదయం 10 గంటల తర్వాత ప్రతి వాహనదారుడిని ప్రశ్నించి గుర్తింపు కార్డులు పరి శీలించాలన్నారు. ప్రభుత్వ ఉత్త ర్వులను అనుసరించి మినహా యింపులు ఉన్న వ్యక్తులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా వారి వద్ద ఉన్న పత్రాల ను పరిశీలించి పంపించాలన్నారు. ఎస్బీ అదనపు డీసీపీ జనార్దన్, ఏసీపీలు జితేందర్రెడ్డి, గిరికుమార్, ఇన్స్పెక్టర్లు ఉన్నారు.
అత్యవసర సేవలకు పాస్లు జారీ
లాక్డౌన్ సమయంలో అత్యవసర సేవలతోపాటు నిత్యావసర వస్తువులు రవాణా చేసే విభాగాలకు పాస్లు జారీ చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. పాసుల కోసం కమిషనరేట్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లో దరఖాస్తులు చేసుకో వాలన్నారు. మిగతా వివరాల కోసం ఏసీపీ శివరామయ్య 9000 466488 నెంబర్లో సంప్రదించాలన్నారు.