నర్సంపేట/పరకాల/వర్ధన్నపేట/నెక్కొండ/సంగెం/ పర్వతగిరి/ శాయంపేట/దుగ్గొండి/ నల్లబెల్లి/ ఆత్మకూరు/ గీసుగొండ, జూన్ 11 : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఆందోళనలు నిర్వహించారు. నర్సంపేటలో నిర్వహించిన ధర్నాలో కాంగ్రెస్ నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్రోలియం ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచారని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ వెంటనే గద్దె దిగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పెండెం రామానంద్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. వర్ధన్నపేటలో నిర్వహించిన ఆందోళనలో కాంగ్రెస్ నియోజకవర్గ నాయకుడు బోజుకుండ్ల రవీందర్ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణలు, పోశాల వెంకన్న, జక్కి శ్రీకాంత్ పాల్గొన్నారు. పరకాలలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పట్ట ణ సమన్వయ కమిటీ ఆధ్యక్షుడు దుబాసి వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు దావు పరమేశ్వర్, మార్క అభినవ్, నాయకులు దూలం అనిల్, మంద రాం చందర్, గోనాధ్ పాల్గొన్నారు. ఇదిలా ఉం డగా దుగ్గొండి మండలం గిర్నిబావిలో, నల్లబెల్లి, నెక్కొం డ, చెన్నారావుపేట, ఆత్మకూరు, శాయంపేట, సం గెం, పర్వతగిరి మండల కేంద్రాల్లో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ప్రజా వ్యతి రేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వారు ఎండగట్టారు.