ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలందిస్తున్నాం
మరిన్ని ఆస్పత్రుల్లో చికిత్సకు ఏర్పాట్లు
ఎంజీఎంపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక శ్రద్ధ
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
వైద్యారోగ్య అధికారులతో సమీక్ష
హన్మకొండ, మే 10: కొవిడ్ బాధితులు ఆందోళన చెందొద్దని, ధైర్యంగా ఉండాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం వరంగల్ అర్బన్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అర్బన్, రూరల్ జిల్లాలో కొవిడ్ బాధితులకు అందుతు న్న చికిత్స, ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా, వైద్యా రోగ్య శాఖ, ఎంజీఎం అధికారులతో ఆయన సమీక్షించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొవిడ్ బాధి తులకు చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పా ట్లు చేస్తున్నామని అన్నారు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సి జన్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలి పారు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాల్లో అన్ని వసతులు సమకూర్చుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఎంజీఎం దవాఖానను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఈ ఆస్పత్రిలో కొవిడ్ చికిత్స కోసం 800 బెడ్స్ సిద్ధంగా ఉండగా, 650 ఆక్సిజన్వని, 80 వెంటిలేటర్స్ పడకలున్నాయన్నారు. ఫ్రంట్లైన్ వారియ ర్స్ కోసం ఎంజీఎంలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా చికిత్సకు అవసరమైన వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్ల నియామకానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఎంజీఎంలో హెల్ప్లైన్ నంబర్ 7901518231
వరంగల్ ఎంజీఎం దవాఖానలో బెడ్స్ సౌలభ్యం, కొ విడ్ బాధితులకు అవసరమైన సమాచారం అందించేం దుకు హెల్ప్లైన్ నంబర్ 7901518231 ఏర్పాటు చేసి నట్లు మంత్రి తెలిపారు. వరంగల్ సెంట్రల్జైల్ను ధర్మ సాగర్కు తరలించి, ఏడాదిలో నిర్మాణం పూర్తి చేయను న్నట్లు చెప్పారు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్జైల్ ఉన్న 76 ఎకరాల స్థలంలో అత్యాధునిక టెక్నాలజీతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరే షన్, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి కొవిడ్ వ్యాప్తి నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కేఎంసీ సూపర్ స్పెషాలిటీకి రూ. 8కోట్లు
కాకతీయ మెడికల్ కళాశాలలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వసతులు, సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభు త్వం రూ. 8 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలి పారు. 250 బెడ్స్తో నాన్ కొవిడ్ చికిత్సలను అం దించనున్నట్లు ఆయన చెప్పారు. 363 మంది డాక్టర్లు, ఇతర సిబ్బందిని 15 రోజుల్లో నియమించాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎంపీలు డాక్టర్ బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు డాక్టర్ తాటి కొండ రాజయ్య, పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, హరిత, అధికారు లు, ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు.