జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిజీవీ మహేశ్నాథ్
నయీంనగర్, జూన్9: ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జీవీ మహేశ్నాథ్ అన్నారు. హన్మకొండ కిషన్పురలోని స్వధార్ గృహాన్ని ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్-19 సూచ నలను అనుసరించి సందర్శించి, న్యాయ విజ్ఞాన సదస్సు ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని బాలి కల విద్య, ఆరోగ్య, ఇతర మౌలిక విషయాలను స్వయం గా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లా డారు. చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్తో, సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, దగ్గు, జలుబు, జ్వరంలాంటి ఆరోగ్య సమస్యలు కలిగినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించా రు. పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత కలిగి ఉండా లని, వారి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకో వాలని ఆయన సూచించారు. ప్రవేశం పొందిన బాలికల వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సహాయానికైనా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించి, ఉచిత సలహాలు, సూచనలను పొందవచ్చునని అన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి పద్మావతి, స్వధార్ ఆశ్రమ సూప రింటెండెంట్ సరిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.