కరోనాను కలిసికట్టుగా ఎదుర్కొందాం
సమష్టిగా పనిచేసి వైరస్ను అరికడుదాం
రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
ప్రజాప్రతినిధులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్
తొర్రూరు, మే 8 : కరోనాపై ఆందోళన వద్దని, ధైర్యంతో సమష్టిగా ఎదుర్కొందామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని కరోనా బాధితులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో శనివారం ఆయన టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా పని చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఆశించిన మేరకు సహాయ సహకారాలు అందించడం లేదన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కరోనా నియంత్రణకు అందరితో కలిసి మానిటరింగ్ చేస్తున్నారన్నారు. కరోనా సోకిన వారు ఆత్మైస్థెర్యంతో ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరిస్తూ పరిశుభ్రతను పాటించాలని కోరారు. కరోనా బాధితులతో ఫోన్లో మాట్లాడి వారి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. బాధితులకు ప్రజాప్రతినిధులు అండగా నిలువాలని సూచించారు. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ఆపత్కాలంలో తోచిన సాయం అందించాలని కోరారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటే ఎప్పటికీ వారి గుండెల్లో నిలిచిపోతామన్నారు. టెలీకాన్ఫరెన్స్లో పాలకుర్తి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, పాల్గొన్నారు.