రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం
ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున అందజేత
ఈ నెల 5 నుంచి అందిస్తున్న ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాలో 10,89,744 కుటుంబాలకు లబ్ధి
48,606 టన్నుల బియ్యం కేటాయింపు
వరంగల్రూరల్, జూన్ 7(నమస్తేతెలంగాణ): కరోనా సంక్షోభ సమయంలోనూ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తున్నది. ఎవరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దే శంతో వారికి ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేపట్టింది. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యాన్ని అందజేస్తున్నది. శనివారం నుంచి ప్రతి చౌక ధరల డిపో ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. గత సంవత్సరం కరోనా ఫస్ట్వేవ్ సమయంలో నూ ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం, కంది పప్పును పంపిణీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈసారి కూడా మానవీయకోణంలో పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చేందుకు నిర్ణయించింది. గత మే 12వ తేదీ నుంచి లాక్డౌన్ అమలవుతుండడంతో ఉపాధి కోల్పో యిన పేదలందరికీ ఈ నెల ఐదో తేదీ నుంచి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.
జూన్, జూలై నెలలకు సంబంధించి తెల్ల రేషన్కార్డులో పేరు ఉన్న లబ్ధిదారుల్లో ప్రతి ఒక్కరికీ పదిహేను కిలోల లెక్కన అందజేయాలని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం వరంగల్ ఉమ్మడి జిల్లాకు 48,606 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించింది. వీటిని 32,61,879 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కరోనా నిబంధ నలు పాటిస్తూ ప్రతి చౌక డిపోలో ఉచిత బియ్యం పంపిణీ చేయడం కూడా ప్రారంభించింది. జనరల్ రేషన్ కార్డుల్లో ని కుటుంబసభ్యులకు ఒక్కొక్కరికి 15 కిలోలు, అంత్యోద య, అన్నపూర్ణ రేషన్కార్డుల్లోని కుటుంబసభ్యులకు అద నంగా మరో 10 కిలోల చొప్పున ఉచిత రేషన్ బియ్యాన్ని డీలర్లు అందజేస్తు న్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కష్టకాలంలో ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యాన్ని అందుకుంటున్న పేదలు సంతోషం వ్యక్తం చేస్తు న్నారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ ఉచిత రేషన్ బియ్యం పంపిణీతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో 10,89,744 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
జిల్లాల వారీగా లబ్ధిదారులు
వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 10,89,744 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా అర్బన్ జిల్లాలో 2,66,056, ఆ తర్వాత మహబూబాబాద్లో 2,35,43 2, వరంగల్ రూరల్లో 2,19,245, జనగామలో 1,58, 317, జయశంకర్ భూపాలపల్లిలో 1,21,378, ములుగు జిల్లాలో 89,316 రేషన్ కార్డులు ఉన్నట్లు అధికారులు ప్ర కటించారు. ఈ లెక్కన ఆరు జిల్లాల్లో కలిపి 32,61,879 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో అర్బన్ జిల్లాలో 8,09,224, మహబూబాబాద్లో 7,05,078, వరంగల్ రూరల్లో 6,47,106, జనగామలో 4,87,399, జయ శంకర్ భూపాలపల్లిలో 3,48,805, ములుగు జిల్లాలో 2,64,267 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఒక్కొ క్కరికి పదిహేను కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేసేం దుకు ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం 48,606 మెట్రిక్ ట న్నుల బియ్యాన్ని ఉమ్మడి జిల్లాకు కేటాయించింది. వీటిని విడుతల వారీగా పౌరసరఫరాల శాఖ అధికారులు గోదా ముల నుంచి చౌకడిపోలకు సరఫరా చేశారు. కరోనా నిబం ధనలు పాటిస్తూ చౌకడిపోల డీలర్లు దశల వారీగా కార్డుదా రులకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేయడం మొదలు పెడుతున్నారు. కొన్నిచోట్ల శనివారం, మరికొన్ని చోట్ల ఆది వారం, ఇంకొన్ని చోట్ల సోమవారం నుంచి బియ్యం పంపి ణీ ప్రారంభమైంది. పలు చౌకడిపోల్లో స్థానిక ప్రజాప్ర తినిధులు ఈ ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభించా రు. వరంగల్ రూరల్ జిల్లాలో 464 చౌకడిపోల ద్వారా ఉచిత రేషన్ బియ్యం పంపిణీ జరుగుతున్నట్లు అదనపు కలెక్టర్ బీ హరిసింగ్ చెప్పారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 459, మహబూబాబాద్లో 553, జనగామలో 335, జయశంకర్ భూపాలపల్లిలో 277 చౌకడిపోల ద్వారా ఉచి త రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపా రు. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ చౌకడిపోల డీలర్లకు వ్యాక్సినేషన్ వేసింది.