నర్సంపేట, జూన్ 6 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా నర్సంపేట డివిజన్లో లాక్డౌన్ విజయంతంగా కొనసాగుతున్నది. సడలింపు వేళల్లో కాకుండా లాక్డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులను పోలీసులు గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి కౌన్సెలింగ్ ఇస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలు తమ అవసరాల కోసం రోడ్లపైకి వచ్చారు. దీంతో నిత్యావసర సరుకుల దుకాణాలు. వర్తక, వాణిజ్య సంస్థలు రద్దీగా మారాయి. మధాహ్నం 2 గంటల నుంచి యథావిధిగా లాక్డౌన్ అమలులో ఉంది. అనుమతి లేకుండా రోడ్లపైకి వస్తున్న వాహనదారులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి జరిమానా విధించారు. కరోనా నివారణకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా ఎస్సై నవీన్కుమార్ కోరారు. మరోవైపు అత్యవసర సర్వీసులు, పాస్లు కల్గిన వాహనాలను అనుమతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దవాఖానలకు వెళ్లేవారు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి రైసు మిల్లులకు వెళ్లే లారీలు, ట్రాక్టర్లకు అనుమతి ఇస్తున్నామని ఆయన వివరించారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట : స్థానిక ఎస్సై శీలం రవి ఆధ్వర్యంలో పోలీ స్ సిబ్బంది మండలంలో లాక్డౌన్ను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం నర్సంపేట-నెక్కొండ ప్రధాన రహదారిపై అనుమతి లేకునిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలుండా వచ్చిన 20 మంది వాహనదారులకు రూ.వెయ్యిచొప్పున జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్సై శీలం రవి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనదారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో కరోనా కేసుల పెరుగుతున్నందున లాక్డౌన్ సమయంలో అకారణంగా రోడ్ల మీదకు వచ్చే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు తిరుపతి, ఉపేందర్, రామకృష్ణ, క్రాంతికుమార్, రాము పాల్గొన్నారు.
దుగ్గొండిలో..
దుగ్గొండి : లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఎస్సై రవికిరణ్ వాహనదారులను హెచ్చరించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తూ పోలీస్ స్టేషన్కు తరలించారు. వరంగల్-నర్సంపేట ప్రధాన రహదారిలో గిర్నిబావి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను ఎస్సై రవికిరణ్ పర్యవేక్షించారు. లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వచ్చిన వారికి జరిమానాలు విధిస్తున్నామని ఆయన చెప్పారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తున్నదన్నారు. ప్రజలు సహకరించి స్వీయనియంత్రణ పాటించాలని, మాస్కులు ధరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పొక్కుల రమేశ్, జంపయ్య, ఎల్లయ్య, సతీశ్కుమార్, రాజశేఖర్, పూర్ణచందర్ పాల్గొన్నారు.
పరకాలలో..
పరకాల : ప్రజలు లాక్డౌన్ నిబంధనలను పాటించి కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలని సీఐ పింగిళి మహేందర్రెడ్డి కోరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. వ్యాపారులు తమ షాపుల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని, కొనుగోలుదారులు గుంపులుగా ఉండకుండా చూడాలన్నారు. లాక్డౌన్ సడలించిన సమయంలో ప్రజలు మాస్కులు ధరించి బయటికి రావాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. లాక్డౌన్ సమయంలో రోడ్డు మీదకు వస్తే కఠిన చర్యలు తీసుకంటామని ఆయన హెచ్చరించారు.