పరిశీలించిన కలెక్టర్ ఆర్జీ హన్మంతు
వరంగల్, మే5: మహా నగరపాలక సంస్థ పాలక వర్గం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నా యి. మేయర్, డిప్యూటీ మేయర్తోపాటు ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు గ్రేటర్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మే 7న మేయర్, డిప్యూటీ మేయ ర్ల ప్రమాణ స్వీకారం చేయాలని బుధవారం ఆదే శాలు జారీ చేయడంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. బుధవారం కలెక్టర్ ఆర్జీ హన్మంతు, కమి షనర్గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు చేపట్టిన ఎస్ఈ సత్యనారాయణ ఈ మేరకు అధికారులతో పాలకవర్గం ప్రమాణ స్వీకారంపై చర్చించారు. ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్తోపాటు 64 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. వారితోపాటు మంత్రు లు, ఎక్స్అఫీషియో సభ్యులు హాజరుకానున్న నేప థ్యంలో విశాలమైన స్థలంలో ప్రమాణ స్వీకార వేది కను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అదేశించారు.
ఇండోర్ స్టేడియం ఆవరణలో వేదిక
పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం వేదిక ను బల్దియా లోని ఇండోర్ స్టేడియం ఆవర ణలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ బల్ది యా ఆదనపు కమిషనర్ సత్యనారాయణ, అధికారులతో కలిసి ఆయన ఇండోర్ స్టేడియం ఆవరణను పరిశీలించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మే యర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషి యో సభ్యులు మాత్రమే హాజరుకావాలని కలెక్టర్ కోరారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కరోనా నిబంధనలు పక్కాగా అమలు చేయాలని అధికారు లను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్యదర్శి విజయలక్ష్మి, ఈఈ శ్రీనివా సరావు, డీఈ నరేందర్, రవీందర్ ఉన్నారు.