రైతులు పండించిన ధాన్యపు సిరులతో సోమవా రం జనగామ మార్కెట్ కళకళలాడింది. ఎటు చూసి నా వడ్ల రాశులే కనిపించాయి. అన్నీ అనుకూలించ డంతో పుట్ల కొద్దీ ధాన్యం చేతికి వచ్చింది. దీంతో అన్నదాత సంబురపడుతున్నాడు. ఈ క్రమంలో రైతు లు వడ్లను అమ్మేందుకు కొనుగోలు కేంద్రానికి భారీగా తరలివచ్చారు. మార్కెట్లో రైతులు ధాన్యాన్ని ఆరబోయ డం, తూర్పార బట్టడం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని హమాలీలు బస్తాల్లో నింపడం, అనంతరం గోదాములకు తరలి స్తున్న దృశ్యాలు కనిపించగా ‘నమస్తే’ క్లిక్మనిపించింది.