వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి
హన్మకొండ, మే 31: ప్రభుత్వ అనుమతిలేని, నాణ్యతలేని విత్తనాలను నిరోధించేందుకు రెండు జిల్లాలకు సంబంధించి జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశామని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చ రించారు. సోమవారం వరంగల్ అర్బన్ కలెక్టరేట్లోని సమావేశ మందిరం లో అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్లతో కలిసి రెండు జిల్లాల వ్యవసాయ, పోలీస్ శాఖల అధికారులతో సమావేశంలో వారు మాట్లాడారు. పకడ్బందీ గా విత్తనం చట్టం అమలు చేయాలని, నకిలీ విత్తనాల విక్రయాలపై దాడు లు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రైతులు అధీకృ త డీలర్ల వద్ద రశీదు తీసుకొని మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాల న్నారు. అర్బన్ కలెక్టర్ ఆర్జీ హన్మంతు మాట్లాడుతూ ప్రస్తుత వానకాలంలో జిల్లాలో 1,92,086 ఎకరాల్లో పంటసాగు జరుగుతుందనే అంచనా ఉంద న్నారు. పత్తి విత్తనాలకు సంబంధించి హెచ్టీ కాటన్ (కలుపు మందును తట్టుకొనే పత్తి) ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలు, ఇతర రాష్ర్టాలు, పక్క జిల్లాల నుంచి వచ్చే అవకాశం ఉన్నందున వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎక్కువగా డిమాం డ్, లాభం వచ్చే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలోఅర్బన్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, రూరల్ జిల్లా డీసీపీ వెంకటలక్ష్మి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఉషాదయాళ్, వ్య వసాయ శాఖ ఏడీ దామోదర్, హార్టికల్చర్ అధికారి శ్రీనివాస్, టాస్క్ఫోర్స్ పోలీస్ నోడల్ ఆఫీసర్ ప్రతాప్, అసిస్టెంట్ డైరెక్టర్ సౌమ్య, మండల వ్యవ సాయ శాఖ అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.