హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 6 : ప్రస్తుత జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా పైల్స్ పేషంట్స్ పెరుగుతున్నారని.. ముందస్తు జాగ్రత్తలతో పైల్స్ను అరికట్టవచ్చని చెబుతున్నారు ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ కూరపాటి రమేశ్. పైల్స్కి లేజర్, స్టాప్లర్ చికిత్స, నాటువైద్యం.. ప్రమాదాల గురించి క్లుప్తంగా వివరించారు.. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..
మలద్వారం చుట్టూ దురద, మలవిసర్జన సమయంలో మొలలు చేతికి తగలడం, మలంలో రక్తం కారడం, మంట, నొప్పిగా ఉండడం. మొలలు బయటనే ఉండడం. మలవిసర్జనకు ఎక్కువ సమయం తీసుకోవడం.
సాధారణంగా పైల్స్, ఫిషర్, ఫిస్టులా సమస్యలతో బాధపడేవారు ఆపరేషన్ నొప్పికి భయపడి నాటు వైద్యులను సంప్రదిస్తారు. నాటు వైద్యులు ఆపరేషన్ లేకుండా చేస్తామని, గ్యారంటీ ఇస్తామని, తక్కువ ఖర్చుతో వైద్యం పూర్తవుతుందని చెప్పడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడం.
మత్తు డాక్టర్ లేకుండా వైద్యం చేసే సమయంలో హఠాత్తుగా ప్రాణాపాయం కలుగవచ్చు. అపరిశుభ్ర వాతావరణం, పరికరాలు, అశాస్త్రీయ పద్ధతుల వలన ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లతో ఉన్నదానికంటే ఇంకా సంక్లిష్టం కావొచ్చు.