ఖిలావరంగల్ : జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల వేగం పెంచాలని కలెక్టర్ గోపి అన్నారు. బుధవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 4957 ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 671 ఇండ్లు పూర్తయ్యాయని, వివిధ దశలలో ఉన్న ఇండ్ల నిర్మాణాలను వెంటనే చేపట్టాలని సూచించారు. ఏదైన సమస్య తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో పాలకుర్తి డివివిజన్ ఇరిగేషన్ ఈఈ రమేశ్బాబు, పీఆర్ ఈఈ శంకరయ్య, ఇరిగేషన్ డీఈఈ కిరణ్కుమార్ పాల్గొన్నారు.