కరీమాబాద్ : ప్రభుత్వం విడుదల చేసిన ఐసెట్ పరీక్ష ఫలితాల్లో అండర్రైల్వేగేట్ లక్ష్మినగర్ ప్రాంతానికి చెందిన బత్తుల అరుణ్కుమార్ రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంకును సాధించాడు. ఈ మేరకు తండ్రి సురేందర్ తల్లి శోభ తమ కుమారుడికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకు రావడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అరుణ్కుమార్ మాట్లాడుతూ పరీక్ష ఫలితాలు సంతృప్తినిచ్చాయన్నారు. కష్టపడినందుకు తగిన ఫలితం దక్కిందన్నారు. తన చదువు కోసం కష్టపడిన తల్లిదండ్రులకు రుణపడి ఉంటానన్నారు. పలువురు నాయకులు, స్థానికులు అరుణ్కుమార్ను అభినంధించారు.