వరంగల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వైద్యం వికటించి ఇద్దరు కవల పిల్లలు మృతి చెందారు. ఈ విచారకర సంఘటన వరంగల్ వెంకట్రామా థియేటర్ సమీపంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక కాశిబుగ్గకు చెందిన ఓ గర్భిణి చికిత్స కోసం సదరు ప్రైవేటు దవాఖానకు వెళ్లింది. అయితే డెలివరీ సమయంలో ఇవ్వాల్సిన ఇంజక్షన్ ఆరో నెలలోనే ఇవ్వడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని బాధితురాలి కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు.
విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల బృందం దవాఖానలో విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.