కరీమాబాద్, డిసెంబర్ 4: ఉర్సు బైపాస్ రోడ్డులోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో సీబీఎస్ఈ సౌత్జోన్ స్థాయి ఈత పోటీలు ఆదివారం హోరాహోరీగా కొనసాగాయి. నువ్వా-నేనా అన్నట్లుగా క్రీడాకారులు గెలుపు కోసం తలపడ్డారు.
పాఠశాల డైరెక్టర్ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. పోటీలు ఈనెల 5తో ముగుస్తాయన్నారు. విజేతలకు బహుమతులతో పాటు సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు.