హనుమకొండ : గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండాప్రకాశ్, కలెక్టర్ రాజీవ్గాంధీహన్మంతు సర్పంచులకు సూచించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆజాద్కా అమృత్ మహోత్సవం స్వచ్ఛత హి సేవ-2021లో భాగంగా ఓడిఎఫ్ ప్లస్ గ్రామాల సర్పంచ్లతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండప్రకాశ్ మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి జరగాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని అపుడే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
సర్పంచులు, పంచాయతీ సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్ది సౌకర్యం కల్పించాలని సూచించారు. వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వేరు చేయాలని అన్నారు. ప్రతి రోజు ట్రాక్టర్ ద్వారా చెత్తను పారవేయాలని అన్నారు. కలెక్టర్ రాజీవ్గాంధీహన్మంతు మాట్లాడుతూ ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా రూపుదిద్దుకునేందుకు అందరూ సమన్వయంతో కృషి చేయాలన్నారు. వంద శాతం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించిన 23 గ్రామాల సర్పంచ్లకు సర్టిఫికెట్లను అందచేశారు.
గ్రామ అభివృద్ధికి విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన అన్నారు. వంద శాతం వ్యాక్సినేషన్ గ్రామంగా ప్రకటించేందుకు సర్పంచ్లు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, డీఆర్డీవో ఎ. శ్రీనివాస కుమార్, ఏవో శ్రీనివాస్రెడ్డి , స్వచ్ఛభారత్ జిల్లా కోఆర్డినేటర్ సంపత్ కుమార్, ప్రవీణ్, ఎంపీడీవోలు, 23 గ్రామల సర్పంచులు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.