వరంగల్ రూరల్ : నర్సంపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)లో రాబోయే రెండు రోజుల్లో మరో 20 ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి రానున్నాయి. కొవిడ్-19 రోగులకు అత్యవసర చికిత్స అందించేందుకు ఈ మేరకు వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఉన్న 20 పడకలకు తోడు మరో 20 పడకలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక ఆక్సిజన్ పడకలు కలిగిన సీహెచ్సీగా నర్సంపేట సీహెచ్సీ నిలవనుంది. ఈ కేంద్రంలో రెమ్డెసివిర్ ఇంజక్షన్లు కూడా అందుబాటులో ఉన్నట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఈ సీహెచ్షీ మొత్తం బెడ్ల కెపాసిటీ 70. మరోవైపు పట్టణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయబడింది.