వరంగల్ రూరల్: పల్లెప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నాలుగో విడత పల్లెప్రగతిలో భాగంగా దామెర మండలం కోగిల్వాయిలో పారిశుధ్య పనులను పరిశీలించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం గ్రామస్థులందరి బాధ్యత అని వెల్లడించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటుచేసిన గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి ద్వారా గ్రామాల రూపురేఖలు మారాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో అలసత్వం వహించినవారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.