హైదరాబాద్ : నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి పెద్ది రాజిరెడ్డి (89) ఈ నెల 14న అనారోగ్యంతో కన్నుమూశారు. శనివారం సుదర్శన్ రెడ్డి స్వగ్రామం వరంగల్ జిల్లా నల్లబెల్లిలో రాజిరెడ్డి దశదిన కర్మ జరిగింది. కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజిరెడ్డి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్తోపాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.