నల్లబెల్లి, ఆగస్టు 25: ముదిరాజ్ల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని మేడెపల్లిలో ముదిరాజ్ల ఆరాధ్య ధైవమైన పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సాన్ని ముదిరాజ్ నాయకుడు తాడెబోయిన స్వామినాథ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, విశిష్ఠ అతిథిగా ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్య వైఖరికి ముదిరాజ్ల జీవితాలు దుర్భరంగా మారినట్లు సీఎం కేసీఆర్ గుర్తించారన్నారు. దీంతో ప్రత్యేక నిధులు వెచ్చించి ముదిరాజ్ల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలిపారు. కాకతీయుల కాలం నాటి చెరువులు, కుంటలు పూడికతో కూరుకుపోయిన క్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా పూటిక తీయించినట్లు గుర్తుచేశారు. దీంతో ప్రతి చెరువు మినీ ట్యాంకుబండ్లా తయారు కావడంతోపాటు మత్స్యకారులు చేపల పెంపకం చేపట్టి ఆర్థికంగా ఎదుగుతున్నారని వివరించారు.
ఉచితంగా చేపపిల్లల పంపిణీ
సీఎం కేసీఆర్ ముదిరాజ్ల సొసైటీలను అభివృద్ధి పరు స్తూ ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడంతోపాటు టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ వాహనాలను పంపిణీ చేశారని ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ అన్నారు. అలాగే, ముదిరాజ్లు చేపలు విక్రయించుకునేందుకు మార్కెట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. అంతేకాకుండా చెరువులపై హక్కును ముదిరాజ్లకే ఉండేలా రాష్ట్ర సర్కార్ కృషి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, సర్పంచ్లు చింతపట్ల సురేశ్రావు, లావుడ్యా తిరుపతీనాయక్, విగ్రహ దాతలు కిశోర్రెడ్డి, కీసరి నరేందర్, కొత్తపెల్లి కోటిలింగాచారి, గోనెల నరహరి, జట్టి సాంబయ్య, గందె రాజు, ఐలయ్య, ముర ళి, సమ్మయ్య, రాజు, సంఘ పోశాలు, ఆవుల సదయ్య, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఎన్ వెంకన్న పాల్గొన్నారు.