నయీంనగర్, ఆగస్టు25: కాకతీయ యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవం గురువారం విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహించారు. చాన్స్లర్ హోదాలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా న్యూఢిల్లీలోని సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు కార్యదర్శి సందీప్ వర్మ ప్రసంగించారు. విద్యార్థులు, పరిశోధకులకు డిగ్రీలు, బంగారు పతకాలు అందజేశారు. కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు కుటుంబీకులతో కలిసి రావడంతో కేయూలో సందడి వాతావరణం నెలకొంది. తొలుత విశ్వవిద్యాలయ అతిథి గృహంలో వైస్ చాన్స్లర్ ఆచార్య తాటికొండ రమేశ్ గవర్నర్కు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం పాలకమండలి సభ్యులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా ఆర్ట్స్, సోషల్ సైన్స్, కామర్స్, సైన్స్, ఫార్మసీ, విద్య, ఇంజినీరింగ్ విభాగాల్లో 59 మందికి పీహెచ్డీ డిగ్రీలు, 192 మందికి 276 గోల్డ్ మెడల్స్ను ప్రదానం చేశారు. అదేవిధంగా ఇటీవల బాసరలోని ట్రిపుల్ ఐటీలో విద్యార్థి, సంగెం మండలం ఎల్గూరు రంగంపేటకు చెందిన సంజయ్ కిరణ్ మృతి చెందగా, అతడి కుటుంబసభ్యులకు కేయూ గెస్ట్హౌస్లో రూ. రెండు లక్షల చెక్కును అందజేశారు.
పోలీసుల భారీ బందోబస్తు
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్నాతకోత్సవ సభా స్థలిలో డాగ్స్కా డ్ ప్రత్యేక తనిఖీలు చేశారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వెంకట్రామ్రెడ్డి, మాజీ వైస్ చాన్స్లర్ ఆచార్య ఎన్ లింగమూర్తి, ఆచార్య విద్యావతి, పాలక మండలి సభ్యులు ఆచార్య మనోహర్, మల్లారెడ్డి, సుమతి, ఉమామహేశ్వరి, డాక్టర్ నాగేంద్రబాబు, మదన్కుమార్, చంద్రమౌళి, సీతారాం, చంద్రమౌళి, రాజిరెడ్డి, అకాడమిక్ సెనెట్ సభ్యులు డాక్టర్ అంపశయ్య నవీన్, పోకల చందర్, మాణిక్యం, గొల్లపూడి జగదీశ్, డీన్లు ఆచార్య బన్న అయిలయ్య, రాజిరెడ్డి, ఎన్ రామనాథకిషన్, తాడిశెట్టి శ్రీనివాసులు, టీ శ్రీనివాస్, వై నరసింహా రెడ్డి, మల్లారెడ్డితోపాటు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
ఫలవంతమైన సేవలందించాం..
కాకతీయ విశ్వవిద్యాలయం 47 సంవత్సరాలుగా ఫలవంతమైన సేవలను గ్రామీణ, అట్టడుగు వర్గాలకు అందిస్తున్నాం. 8 ఫ్యాకల్టీలు, 27 విభాగాలు, 17 క్యాంపస్, 529 అనుబంధ కళాశాలలతో 2లక్షల పైన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం న్యాక్ ఏ గ్రేడ్తో ఉన్న విశ్వవిద్యాలయం నాల్గో సైకిల్కు సిద్ధమవుతోంది. జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్లతోపాటు బ్రిటిష్ విశ్వవిద్యాలయాలతో భాగస్వా మ్యం, అవగాహన ఒప్పందాలతో విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడికి ఆసారం ఉంటుంది. జాతీయ స్థాయి పరిశోధనా సంస్థలతో ప్రాజెక్టు అమలవుతోంది. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, రెడ్క్రాస్ ఆధ్వర్యంలో ఆదివాసీ గ్రామాలను దత్తత తీసుకొని స్వచ్ఛభారత్, హరితహారం, యువజనోత్సవాలు, క్రీడలు, యోగా, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పోటీ పరీక్షల కేంద్రం నిర్వహించడం, మహిళా, అంబేదర్, గాంధీ, ఫూలే అధ్యయనాలు చేపడుతున్నాం. పీవీ విజ్ఞాన పీఠం పురోగతిలో ఉందని, ప్రాంగణ నియామకాల్లో మంచి రికార్డు ఉంది.
– తాటికొండ రమేశ్, కేయూ వీసీ
కొత్త జ్ఞానం కోసం పరితపించాలి
ప్రతి ఒక్కరూ కొత్త జ్ఞానంతో ఎల్లప్పుడు సిద్ధంగా ఉండి ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలి. కొవిడ్ మహమ్మారి మన జీవితాలపై చూపిన ప్రభావంతో మొకవోని స్ఫూర్తితో గతంలో కంటే ఎకువ అవకాశాలను పొందగలిగాం. క్లిష్ట సమయంలో మన స్పష్టమైన కోరిక, ఆశ, ఉత్సాహం ముందుకు తీసుకు పోతుంది. మన ఆలోచనలు, పరిధి మారుతుండడం కెరీర్కు ప్రతిబంధకం కాకూడదు. సంక్లిష్ట సమస్యలు ఎదురొనే నైపుణ్యాలు పెంచుకోవాలి. మన బలాలు, పని తీరు, సామర్థ్య, మానసిక స్థితిని అంచనా వేయగలిగి సరైన సలహా ఇచ్చే సరిల్ను గుర్తించాలి. సవాళ్లను ఎదుర్కోవడానికి నిరంతర అభ్యసన అవసరం. ఆ దిశగా 2020 జాతీయ విద్యా విధానం అడుగులు వేస్తోంది. కొవిడ్ మహమ్మారి మానవాళిపై సవాలు విసిరినప్పుడు దేశీయ వ్యాక్సిన్ గొప్ప ఫలితాలను ఇచ్చింది. మనం ఉహించిన దాని కంటే ఎకువ సవాళ్లను మన జ్ఞానాన్ని ఉపయోగించి అధిగమించి పరిషారాలు వెతికాం. భారతదేశం 3వ అతి పెద్ద స్టార్టప్గా అవతరించింది. 2016లో 471 ఉన్న స్టార్టప్లు 2022లో 73,000కు చేరడం గర్వకారణం. తెలంగాణ రాష్ట్రం నాలుగు యూనికాన్లతో 6500ల స్టార్టప్లతో ప్రపంచ స్థాయి నాణ్యమైన సేవలు సరసమైన ధరలకు లభించడం, అత్మనిర్బర్ దిశగా పయనించడం గొప్ప విషయం. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పట్టభద్రులుగా ఉన్న వారు 2047 సంవత్సరంలో స్వతంత్ర భారత శత వసంతాల రూపశిల్పులుగా ఉండాలి.
– సందీప్ వర్మ, సెర్బ్ కార్యదర్శి