రోహిణి కార్తె ప్రవేశించడంతో రైతులు వానకాలం సాగుకు సమాయత్తమయ్యారు. ఈ సమయంలో విత్తనాలు వేస్తే పంట బాగా వస్తుందని నమ్మకం. కొందరు తొలకరి కోసం ఎదురుచూస్తుండగా, చాలామంది రైతులు ఇప్పటికే ఎవుసం పనులు మొదలుపెట్టారు. ఆదివారం జనగామ జిల్లాలోని నీర్మాల, సింగరాజుపల్లి, పటేల్గూడెం, నెల్లుట్లలో రైతులు చేన్లలో మిగిలిన పత్తి కట్టెలు, గడ్డి, ఇతర వ్యర్థాలను కూలీలతో ఏరివేస్తూ కనిపించారు. ఆ తర్వాత ఎడ్లు, ట్రాక్టర్లతో దుక్కి దున్ని, అచ్చుతోలి పత్తి గింజలు విత్తారు. అలాగే మరికొన్ని చోట్ల విత్తనాలు అలకడం, నారుమడులు సిద్ధంచేసుకుంటూ సాగు పనుల్లో హుషారుగా ఉన్నారు.
– ఫొటోగ్రాఫర్, జనగామ