‘సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తే దేశంలో విప్లవాత్మక మార్పులు తప్పక వస్తాయి.. ఆయన బీఆర్ఎస్తో ముందుకు రావడం శుభపరిణామం’ అని ఫీల్ట్ అసిస్టెంట్లు స్వాగతం పలుకుతున్నారు. గొప్ప ఆలోచనలను ఆచరణలో పెడుతూ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తూ సుపరిపాలన అందిస్తున్న కేసీఆర్కు దేశాన్ని పాలించే అన్ని అర్హతలూ ఉన్నాయని అంటున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ‘నేనున్నా’ననే భరోసా ఇచ్చే కేసీఆర్తోనే దేశంలో సబ్బండ వర్గాలకు భరోసా దొరుకుతుందని అభిప్రాయపడుతున్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 7
బీఆర్ఎస్కు పూర్తి మద్దతిస్తాం..
గీసుగొండ : దేశంలో పరిపాలన మరిచి మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీని గద్దె దించగల ఏకైక నాయకుడు కేసీఆరే. ఆయన ముందుచూపు, ఆలోచనా విధానం వల్లే ఇవ్వాళ తెలంగాణలో రైతులు, ఉద్యోగులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాల వారు అభివృద్ధి ఫలాలు అందుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఆయన దేశ రాజకీయాల్లో ఉంటే తెలంగాణ తరహాలో అందరికీ సంక్షేమ పథకాలు అందే అవకాశం ఉంటుంది. జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఆవిర్భావంతో దేశంలో నూతన ఉత్తేజం వచ్చింది. దేశంలో ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా మోదీ మాత్రం పట్టించుకోకుండా అన్నీ అమ్మే పరిస్థితి తీసుకొచ్చాడు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం వల్ల దేశంలో గొప్ప మార్పు వస్తుందని బలంగా నమ్ముతున్నాం. బీఆర్ఎస్కు మా పూర్తి మద్దతు ఉంటుంది.
– కేలోత్ స్వామి చౌహాన్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, వరంగల్
మా జీవితాల్లో వెలుగునింపాడు
నర్మెట, అక్టోబర్ 7 : ఫీల్డ్ అసిస్టెంట్ల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపాడు. ఉపాధి హామీ పథకంలోకి మమ్మల్ని తిరిగి తీసుకోవడంతో మా కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆలోచిస్తున్న నాయకుడు కేసీఆర్. ఇలాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. అలాగే దేశ ప్రజలకు కూడా తెలంగాణ తరహా పథకాలు, సాయం అందాలంటే కేసీఆర్తోనే సాధ్యం. అందుకే కేసీఆర్ రాక కోసం అన్ని రాష్ర్టాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. భారత ప్రధాని అయ్యేందుకు సీఎం కేసీఆరే సరైనోడు. కేంద్రంలోని బీజేపీ తీరుతో ప్రజలు విసిగిపోయారు. ప్రత్యామ్నాయ శక్తి కేసీఆరే.
– చేర్యాల అంజనేయులు, ఫీల్డ్ అసిస్టెంట్, వెల్దండ
సుపరిపాలన కేసీఆర్కే సాధ్యం..
చిట్యాల, అక్టోబర్ 7 : తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తూ సుపరిపాలన అందిస్తున్నారు సీఎం కేసీఆర్. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో పారదర్శకంగా అందేలా ఆన్లైన్ విధానం తీసుకొచ్చి అక్రమాలకు తావులేకుండా చేశారు. ఈజీఎస్ నిధులు దుర్వినియోగం కాకుండా రాష్ట్ర అభివృద్ధి పనులకు ఉపయోగించారు. అలాగే వంద రోజుల పనుల్లో కూలీల సంఖ్యను పెంచి, గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో నిధులు దుర్వినియోగం కావడమే గాక, నిధులు తిరిగి వెనక్కిపోయేవి. దేశ రాజకీయాలు ఆందోళనకరంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ బీఆర్ఎస్తో ముందుకురావడం శుభపరి ణామం. ఆయన అద్భుతంగా రాణిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సమయంలో జాతీయ రాజకీయాలను మార్చగల ఏకైక నాయకుడు కేసీఆరే.
– కలికోట రాజభద్రయ్య, ఫీల్డ్ అసిస్టెంట్, నవాబుపేట
కేసీఆర్ సార్ది పెద్ద మనసు
బచ్చన్నపేట, అక్టోబర్ 7 : మనసున్న మారాజు సీఎం కేసీఆర్ సార్. చిన్న ఉద్యోగైనా పెద్ద ఉద్యోగైనా అందరి క్షేమం కోరే నాయకుడు. కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. గతంలో సమ్మె చేసినప్పుడు మమ్మల్ని తీసివేసినా.. మళ్లీ పెద్ద మనసుతో విధుల్లోకి తీసుకున్నడు. ఉద్యోగంలోకి మళ్లీ తీసుకొని మా కుటుంబాలకు పెద్ద దిక్కయిండు. మాకు ఉద్యోగం వస్తదని ఊహించలేదు. ఆయన రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. ఇలా ఒక్క వర్గాన్ని, ఒక్క శాఖనే కాదు.. ప్రతి ఒక్కరికి నేనున్నా అనే భరోసా ఇస్తున్నారు. ప్రజా, రైతు, మహిళా సంక్షేమంతో పాటు ఉద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ చూపుతున్న చొరవ భేష్. అందరి గురించి ఆలోచించడం వల్లే రాష్ట్రం ప్రగతిలో దూసుకుపోతోంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో దేశం దశ, దిశ మార్చగలరని మా బలమైన నమ్మకం. అది కేసీఆర్తోనే సాధ్యం.
– పాకాల రాజేశ్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, ఆలింపూర్
బీఆర్ఎస్తో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు..
వెంకటాపురం (నూగూరు), అక్టోబర్ 7 : ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. దేశ రాజకీయాల్లో ఉండి కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వంలో ఉండే పలు ప్రజా సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలుచేసే అవకాశం ఉంటుంది. రాష్ర్టాలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరుగుతాయి. కేసీఆర్ వంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లో ఉండాల్సిందే. దేశ ప్రజలంతా ఇప్పుడు సీఏం కేసీఆర్ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
– పాయం రమేశ్, ఫీల్డ్ అసిస్టెంట్, వెంకటాపురం(నూగూరు)
రైతులకు మరింత ‘ఉపాధి’
మల్హర్, అక్టోబర్ 7 : తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నరు. పేదలు, రైతులు, అన్ని వర్గాలను ఆదుకునేందుకు కొత్త కొత్త సంక్షేమ పథకాలు తెచ్చి ఆసరా అవుతున్నారు. ప్రస్తుతం జాతీయ పార్టీ బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం మంచి పరిణా మం. దేశ రాజకీయాల్లోకి రావడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఉపాధి హమీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు ఆర్థికంగా మరింత మేలు జరుగుతుంది.
– అజ్మీర సంతోష్, పెద్దతూండ్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధి హమీ ఫీల్డ్ అసిస్టెంట్ ట్రెజరర్
ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి
నర్సింహులపేట, అక్టోబర్ 7 : సీఎం కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాలు, సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చి అన్నదాతకు కొం డంత భరోసా ఇచ్చారు. ఉచిత విద్యు త్, సాగునీరు, మద్దతు ధర, రైతు పెట్టుబడి, రైతుబీమా పథకాలు తీసుకొచ్చి రైతు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషిచేస్తున్నారు. కేసీఆర్కు ఉన్నంత పట్టుదల దేశంలో ఎవరికీ లేదు. అం దుకే ఆయన అందరినీ మెప్పించి తెలంగాణ సాధించేదాకా పోరాటం చేశారు. పట్టుదల ఉన్న నాయకుడు సాధించలేనిది ఉండదు. అభివృద్ధి, సంక్షేమంలోనూ ఆయన పనితీరు అలాగే ఉంటుంది. అందుకే దేశ రాజకీయాల్లో ఆయనతోనే పెనుమార్పు వస్తుంది. జాతీయ పార్టీ బీఆర్ఎస్ ద్వారా తప్పకుండా లక్ష్యం చేరుకుంటారు. కేసీఆర్తోనే దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి.
– చలమల్ల వీరన్న, ఫీల్డ్ అసిస్టెంట్, పెద్దనాగారం
అన్ని వర్గాలకు మేలు
మహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 7 : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకొని వారి కుటుంబాలకు అండగా నిలిచారు. ఎఫ్ఏల జీవితాల్లో వెలుగులు నింపి వారికి మంచి గౌరవం అందించారు. పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం కృషిచేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉద్యోగులకు అధిక వేతనాలు అందుతున్నాయంటే అది కేసీఆర్ చలవే. కేసీఆర్ ఆలోచనా విధానంతో దేశంలో నిరుపేదలకు మేలు జరుగుతుంది. దేశానికి కేసీఆర్ మంచి నాయకుడిగా సేవలందిస్తారు.
– ఉప్పలయ్య గాంధీ, ఫీల్డ్ అసిస్టెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, మహబూబాబాద్ (టీఆర్ఎస్కేవీ)
దేశం దశ, దిశ మారుతుంది..
ఖానాపురం, అక్టోబర్ 7 : దేశంలో పేదరికాన్ని తరిమికొట్టి దేశం దశ, దిశను మార్చే శక్తి కేసీఆర్కే సాధ్యం. పాలనలో కొత్త ఒరవడిని తీసుకువచ్చి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ పాలన అందిస్తున్నారు. ఎనిమిదేండ్ల కాలంలోనే తెలంగాణను అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిపారు. కేసీఆర్ బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం శుభపరిణామం. దేశానికి ఎంతో మేలు చేకూరుతుంది. దళితబంధు, ఉచిత కరంటు వంటి పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేస్తారు. దేశంలో ఉన్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకుని ప్రపంచ దేశాల్లో భారత్ను అగ్రస్థానంలో నిలిపే తెలివితేటలు కేసీఆర్కు పుష్కలంగా ఉన్నాయి. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని మేమంతా స్వాగతిస్తున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్లకు బతుకుదెరువు చూపి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాడు. ఫీల్డ్ అసిస్టెంట్ల అందరూ కేసీఆర్కు రుణపడి ఉంటారు.
– వేల్పుల రాజు, ఫీల్డ్ అసిస్టెంట్, మనుబోతులగడ్డ