రాయపర్తి, అక్టోబర్ 6 : రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు నేరుగా అందుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. గురువారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సారధ్యంలోని రాష్ట్ర ప్రభు త్వం సకల వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పారదర్శక విధానాలతో అర్హులందరికీ రాజకీయాలు, జెండాలు, అజెండాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని చెప్పారు. దీంతో పైరవీకారులు, దళారీల వ్యవస్థ భూస్థాపితం అయిందని వివరించారు. విజయదశమి పర్వదినం సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో ప్రతిపక్షాల గుండెల్లో వణు కు మొదలైందన్నారు. అనంతరం మండలంలోని కొండాపురంలో ఆర్టీసీ డ్రైవర్ బొమ్మగాని రవి తల్లి బొమ్మగాని సుగుణమ్మ, కేశవాపురం మాజీ అధ్యక్షుడు తాళ్లపల్లి నాగయ్య తండ్రి తాళ్లపల్లి సోమ య్య, మైలారం గ్రామానికి చెందిన బోయిని యాకయ్య వివిధ కారణాలతో మృత్యువాత పడగా బాధిత కుటుంబాలను పరామర్శించారు.
మైలా రం గ్రామానికి చెందిన పరుపాటి యమున, కొలన్పల్లి గ్రామానికి చెందిన పలువురికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్ల సుధీర్రెడ్డి, నాయకులు పూస మధు, గబ్బెట బాబు, సర్పంచ్లు కోదాటి దయాకర్రావు, లేతాకుల సుమతి, చిలుముల ఎల్లమ్మ, ఎంపీటీసీలు గాడిపల్లి వెంకన్న, తేరాల యాకయ్య, గూడెల్లి వెంకన్న, సంది వంశీధర్రెడ్డి, మహ్మద్ అక్బర్, అశ్రఫ్పాషా, బాద సారయ్య, గబ్బెట యాకయ్య, పెదగాని సంతోష్కుమార్, తోట నర్సింగం, చిట్యాల వెంకటేశ్వర్లు, వంగాల నర్సయ్య, తోట సుదర్శన్, గజ్జి శ్రీనివాస్, మొలుగూరి పున్నమయ్య, ముత్తడి సాగర్రెడ్డి, జలగం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అలా గే, పర్వతగిరిలోని మంత్రి ఎర్రబెల్లి నివాసానికి వెళ్లి శాలివాహన కుమ్మరి సంఘం ప్రతినిధులు దయాకర్రావును కలిసి తమ సమస్యలను విన్నవించారు. మండల కేంద్రంలో తమ ఇలవేల్పు ముత్యాలమ్మ తల్లికి ఆలయ నిర్మాణంతో పాటు కమ్యూనిటీ హాల్, ప్రహరీ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీలు అయిత రాంచందర్, బిల్ల రాధిక, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ముద్రబోయిన సుధాకర్, పోగులకొండ వేణు తదితరులు పాల్గొన్నారు.