కరీమాబాద్, అక్టోబర్ 6 : ఉర్సు రంగలీలా మైదానంలో దసరా వేడుకలు బుధవారం అంబరాన్నంటాయి. జోరు వర్షంలోనూ మైదానం ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఆటా-పాట, పటాకుల మోతతో ఉర్సు గుట్ట దద్దరిల్లింది. మంత్రి దయాకర్రావు రావణ ప్రతిమకు నిప్పంటించి సంబురాలను ప్రారంభించారు. ఇక్కడ తొలిసారి ఏర్పాటు లేజర్ షో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఉర్సు గుట్టపై వేసిన రామాయణ చిత్రాలు చూస్తున్నంత సేపు యువత జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు. లేజర్ షో సమయంలో నిర్వాహకులు మైదానంలోని లైట్లను ఆర్పివేయడంతో ప్రజలు తమ సెల్ఫోన్ లైట్లను ఆన్ చేసి ఆనందంతో డ్యాన్స్లు చేశారు. అలాగే, తారాజువ్వల హరివిల్లు కళ్లకు కనువిందు చేసింది. ఈ సారి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పటాకులు ప్రజలను ఆకట్టుకున్నాయి. కాగా, వానకు పూర్తిగా తడిసిన రావణ ప్రతిమ పూర్తిగా కాలకపోవడంతో దాని వద్ద తారాజువ్వలను పేల్చారు.
అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, సీపీ తరుణ్జోషి, కలెక్టర్ గోపి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, కార్పొరేటర్లు మరుపల్ల రవి, పల్లం పద్మ, పోశాల పద్మ, మాజీ కార్పొరేటర్లు కత్తెరశాల వేణుగోపాల్, బత్తిని వసుంధర, నాగపురి కల్పన, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపురి సంజయ్బాబు, ప్రధాన కార్యదర్శి మేడిది మధుసూదన్, కన్వీనర్ వొడ్నాల నరేందర్ ట్రస్టు చైర్మన్ వంగరి కోటేశ్వర్, ఉపాధ్యక్షులు గోనె రాంప్రసాద్, పొగాకు సందీప్, నాగపురి రంజిత్, వంచనగిరి సమ్మయ్య, వొగిలిశెట్టి అనిల్కుమార్, దామెరకొండ వెంకటేశ్వర్లు, కార్య నిర్వాహక కార్యదర్శులు బత్తిని అఖిల్, సుంకరి సంజీవ్, బజ్జూరి వాసు, కూసం శ్రీనివాసులు, పూదరి అజయ్, నాగపురి అశోక్, బొల్లం రాజు, కార్యదర్శులు నాగపురి మహేశ్, నరిగె శ్రీను, గట్టు గోవర్ధన్, కత్తెరశాల వేణుగోపాల్, వొడ్నాల శ్రీను, బొమ్మల్ల అంబేద్కర్, నాగపురి సంతోష్, బొల్లం మధు, ఆర్గనైజర్లు బిట్ట క్రాంతి, గట్టు రమేశ్, మండ రాజు, వలుస వినయ్, అక్తర్, బిట్ల సతీశ్, కమిటీ సభ్యులు పూజారి విజయ్, పార్వతి కృష్ణంరాజు, బైరి వంశీ, మీరిపల్లి వినయ్, గోగికార్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
కాశీబుగ్గ : నగరంలోని 20వ డివిజన్ పద్మానగర్ చిన్నవడ్డేపల్లి చెరువు సమీపంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కాశీబుగ్గ దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 30 సంవత్సరాలుగా ఓసిటీ మైదానంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మైదానం చుట్టూ ఇళ్ల సంఖ్య ఎక్కువవడంతో ఈ సారి చిన్నవడ్డేపల్లి చెరువు సమీపంలో 10 ఏకరాల స్థలంలో ప్రతి సంవత్సరం బతుకమ్మ, దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు నిధులు కేటాయించారు. కలెక్టర్, కుడా, కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.40లక్షలతో ఏర్పాట్లు చేశారు. ఉత్సవ కమిటీ నిర్వాహకుడు గుల్లపల్లి రాజ్కుమార్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చారు. చెరువు ప్రాంతం ప్రజలతో కిక్కిరిసిపోయింది. కాగా, వర్షం వెలిసిన తర్వాత రాత్రి 8 గంటల నుంచి ఉత్సవాలను ప్రారంభించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, తూర్పాటి సులోచన, ఓని స్వర్ణలత, వస్కుల బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు దూపం సంపత్, సముద్రాల పరమేశ్వర్, కన్వీనర్ బయ్య స్వామి, గుల్లపల్లి రాజ్కుమార్, వేముల నాగరాజు, ఓంప్రకాశ్ కోలారియా, సిద్దోజు శ్రీనివాస్, సిలువేరు శ్రీనివాస్, కేతిరి రాజశేఖర్, ముడుసు నరసింహ, పసులాది మల్లయ్య, గుత్తికొండ నవీన్కుమార్, బండారు శ్రీనివాస్, ములుక సురేశ్, దుబ్బ శ్రీనివాస్, ఎరుకల రఘునాథరెడ్డి, కోట సతీశ్, పోలెపాక మార్టిన్లూథర్ పాల్గొన్నారు.