రాయపర్తి, సెప్టెంబర్ 24 : తెలంగాణ పండుగల ఖ్యాతి విశ్వవ్యాప్తం సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణకు ప్రపంచంలోనే గుర్తింపు వచ్చింది. రాష్ట్ర పండుగల విశిష్టత అందరికీ తెలిసింది. అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. ఇక్కడ అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో మన పండుగలు, సంప్రదాయాలను సమైక్య పాలకులు చులకనగా చూసిన చోటే బతుకమ్మ చీరలు పంచే సంస్కృతికి ముఖ్యమంత్రి బాటలు వేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం అందజేస్తున్న సారెతో పేదింటి ఆడబిడ్డల మోముల్లో సంబురం కనబడుతున్నది. ప్రతిపక్షాల మాటలు నమ్మితే గోస తప్పదు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కలెక్టర్ గోపితో కలిసి శనివారం రాయపర్తి మండల పరిషత్ కార్యాలయంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు అన్ని మతాలను గౌరవిస్తోందన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్య పాలకుల ఏలుబడిలో తెలంగాణ పండుగలు, సంప్రదాయాలను చులకనగా చూసేవారని, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వమే అధికారికంగా బతుకమ్మ చీరలు పంచే సంస్కృతికి బాటలు వేసిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అధ్యక్షతన జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ బీ గోపితో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మండలంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు, ప్రతినిధులు, మహిళా ప్రజా ప్రతినిధులతో కలిసి బస్టాండ్ సెంటర్ నుంచి బతుకమ్మలు చేతబట్టుకుని కోలాటాలు, సామూహిక నృత్యాల నడుమ సభా స్థలికి చేరుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఏనాడు విలువివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వమే అన్ని పండుగలను అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి వృద్ధుల వరకు అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. ఏటా రూ.340 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలందరికీ పని కల్పిస్తూ చీరలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమం విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బానోత్ హరిసింగ్, డీఆర్డీవో మిట్టపల్లి సంపత్రావు, జడ్పీటీసీ రంగు కుమార్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్రెడ్డి, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, ఏపీవో దొణికెల కుమార్గౌడ్, అసిస్టెంట్ డీఆర్డీవో శ్రీనివాస్, ఏపీఎం పులుసు అశోక్కుమార్, సీసీలు చీపురు దేవేంద్ర, అనిత, నాయకులు పూస మధు, గారె నర్సయ్య, అయిత రాంచందర్, బిల్ల రాధిక, కర్ర సరిత, కోదాటి దయాకర్రావు, లేతాకుల సుమతి, గజవెల్లి అనంతప్రసాద్, చిన్నాల తారాశ్రీ, బండి అనూష, బొమ్మెర వీరస్వామి, ఎండీ నయీం, ఉస్మాన్, గట్టు నర్సింహాచార్యులు, వెంకట్రెడ్డి, అమరావతి, గూడెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.