వర్ధన్నపేట, సెప్టెంబర్ 24 : మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, రైతు రుణ విమోచన సమితి అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లుతో కలిసి శనివారం మండలంలోని నల్లబెల్లి, రామోజీకుమ్మరిగూడెం తండా, రామవరం, దివిటిప ల్లి, దమ్మన్నపేట గ్రామాలు, వర్ధన్నపేట పట్టణంలో మహిళలకు బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన్ కార్డుల పంపిణీ చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సీఎం కేసీఆర్ కేవలం 8 సంవత్సరాల్లోనే రాష్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారన్నారు. వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన సం స్కరణలతో రైతులు సంతోషంగా జీవిస్తున్నారన్నారు. వర్ధన్నపేట క్యాంపు కార్యాలయంలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన అనంతరం చీరలు అందజేశారు. మొ త్తం ఐదు గ్రామాల్లో 4225 మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం రూ.4కోట్ల 50లక్షలతో నిర్మించిన డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు.
బాలికల కోసం ప్రత్యేక గురుకులాలు..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో మహిళల ఆత్మగౌరవం రెట్టింపైందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మహిళా సంఘాల ద్వారా మహిళలకు లక్షల రూపాయల రుణాలు మం జూరు చేస్తూ వారు స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తున్నదని వివరించారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీమ్లను బలోపేతం చేశారన్నారు. బాలికల విద్యాభివృద్ధి కోసం ప్రత్యే క గురుకులాలను కూడా ఏర్పాటు చేసిందని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆసరా పింఛన్లను అందిస్తుండడంతో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళలు ఆత్మాభిమానంతో జీవిస్తున్నారన్నారు. అనతి కాలంలోనే రాష్ర్టాన్ని దేశంలోనే అ గ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని అన్ని రాష్ర్టాల మేధావులు, రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారని వెల్లడించిరు. అన్ని విషయాలపై సంపూర్ణ పరిజ్ఞానం కలిగిన సీఎం కేసీఆర్ ప్రజలు అండగా నిలువాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మా ర్గం భిక్షపతి, వైస్ ఎంపీపీ సోమలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా పాల్గొన్నారు.