నెక్కొండ, సెప్టెంబర్ 24: టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని అప్పల్రావుపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కొయ్య శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ మచ్చ వీరన్న, గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు కొయ్యడ సారయ్య, ఉపాధ్యక్షుడు ఊడుగుల సారంగపాణి, ఎస్ఎంసీ మాజీ చైర్మన్ బానోత్ వెంకన్న తదితరులు కాంగ్రెస్ పార్టీని వీడారు. ఈ మేరకు నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం వారు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఒక్క టీఆర్ఎస్తోనే సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఏ పథకమైనా పేదరిక నిర్మూలనే ధ్యేయంగా అమలవుతున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలు ఆర్థిక పరిపుష్టి సాధిస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని సీఎం భావిస్తూ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నారని వివరించారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అండగా నిలుస్తానని ఇచ్చారు. సీనియర్ నాయకులు కొయ్యడ రాంచందర్, జిల్లా యాకయ్య, వెంకన్న, ఇటుకాల కట్టయ్య, మద్ది రవీందర్, మచ్చ రాజు, ప్రవీణ్తోపాటు 70 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, మండల నాయకుడు సూరం రాజిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.