నెక్కొండ, సెప్టెంబర్ 24 : నెక్కొండ పట్టణాభివృద్ధికి కృషి చేస్తా అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నెక్కొండ, దీక్షకుంట, ముదిగొండ, చంద్రుగొండ, అలంకానిపేట, సూరిపల్లి, నాగారం గ్రామాల్లో శనివారం ఆసరా పింఛన్ కార్డులు, బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వట్టె వాగునుంచి రైల్వే స్టేషన్ వరకు జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులు త్వరలోనే పూర్తి చేయిస్తాన్నారు. రూ.50లక్షలతో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు పనులను చేపడుతామన్నారు. పట్టణంలో రెండు కిలోమీటర్ల మేర సీసీ రోడ్తు నిర్మిస్తామన్నారు. నూతన జీపీలకు భవనాల నిర్మాణం కోసం రూ.20 లక్షల చొప్పున కేటాయించనున్నట్లు తెలిపారు. మండలంలోని గిరిజన ఆవాస ప్రాంతాల్లో 17, మైదాన ప్రాం తంలో మరో 5 బీటీ రోడ్ల నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నా రు. దసరా పండుగ తర్వాత అర్హులందరికీ డబుల్బెడ్ రూమ్ ఇళ్లను మం జూరు చేయించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, జడ్పీటీసీ లావుడ్యా సరోజన, నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగని సూరయ్య, సర్పంచ్లు ఆలకుంట సురేందర్, శైలజ, సొంటిరెడ్డి యమున, గీత, ఎంపీటీసీ లింగాల అజయ్, కర్పూరపు శ్రీనివాస్, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్యాదవ్, నాయకులు కట్కూరి నరేందర్రెడ్డి, చల్లా చెన్నకేశవరెడ్డి, గుంటుక సోమయ్య, సూరం రాజిరెడ్డి, ఈదునూరి రమేశ్, ఈదునూరి యాకయ్య, దేవనబోయిన వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు.