వరంగల్ : భారీ వర్షాలకు నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువు మత్తడి పోస్తున్నది. ఈ సందర్భంగా నర్సంపేట శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మత్తడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిండు కుండలా మారిన మాదన్నపేట చెరువును పరిశీలించారు. ఆయన వెంట స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్, మండల, పట్టణ ముఖ్య నాయకులు, సర్పంచ్, కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్, తదితరులు ఉన్నారు.