వరంగల్ : యువత భవిష్యత్తులో రాణించేందుకుగాను వారి అభ్యున్నతి కోసం వరంగల్ కమిషనరేట్ నుంచి పూర్తి సహకారం అందిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి తెలిపారు.
మామునూర్ డివిజన్ పోలీసుల అధ్వర్యంలో బొల్లికుంట వాగ్గేవి ఇంజినీరింగ్ కళాశాల వేదికగా రెండు రోజుల పాటు జరిగే మెగా వాలీబాల్ టోర్నమెంట్ను సీపీ ప్రారంభించారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలోని గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే దిశగా ఈ వాలీబాల్ క్రీడలను ఏర్పాటు చేశామన్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ వారీగా ఎంపిక చేసిన యాభై వాలీబాల్ జట్లు ఈ పోటీల్లో పాల్గొటున్నాయి.
ఈ పోటీల్లో విజేతకు రూ. 30వేలు, రన్నరప్కు రూ. 20వేలు, సెకండ్ రన్నరప్ కు రూ.పదివేల చొప్పున ప్రోత్సాహక నగదు పురస్కారాలను అందజేస్తారు. అనంతరం మామూనూర్, సంగెం మండలాల మధ్య ఏర్పాటు చేసిన తొలి వాలీబాల్ మ్యాచ్ లో పోలీస్ కమిషనర్ ముందుగా తొలి సర్వీస్ చేసి ఈ వాలీబాల్ క్రీడలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, టాస్క్ ఫోర్స్ ఏఎస్పీ వైభవ్ గైక్వాడ్ తదితరులు పాల్గొన్నారు.