వరంగల్ రూరల్ : జిల్లాలోని వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కొవిడ్-19తో వృద్ధ దంపతులు మృతిచెందగా వారి కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. రిటైర్డ్ స్కూల్ టీచర్ వీరమల్ల కృష్ణారెడ్డి(70), అతని భార్య యశోధ(62) కొవిడ్ బారిన పడి చనిపోయారు. వారి చిన్న కుమారుడు వరంగల్లోని ఓ ఆస్పత్రిలో కొవిడ్తో చికిత్స పొదుతున్నాడు. ఇతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని బంధువులు తెలిపారు.