వరంగల్ : వరంగల్లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ను వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సందర్శించారు. సీపీగా భాధ్యతలు చేపట్టిన అనంతరం పోలీస్ కమిషనర్ తొలిసారిగా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కు వచ్చారు. ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి వివిధ కేసుల్లో స్టేషన్ ఆవరణలో వున్న వాహనాలను తక్షణమే సంబంధిత వాహన యజమానులు తీసుకుపోయేలా చూడాలని అధికారులను అదేశించారు.
అనంతరం పోలీస్ స్టేషన్ రిసెప్షన్ కౌంటర్ సిబ్బంది పనితీరుపై అరా తీయడంతో పాటు స్టేషన్ టెక్ విభాగం, కోర్టు, స్టేషన్ రైటర్ల పనీతీరును పోలీస్ కమిషనర్ సంబంధిత విభాగాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై అధికారులతో నేరాల నియంత్రణ, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ వర్టికల్స్ పనితీరును అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. ప్రజలు మనపై వుంచిన నమ్మకానికి తగ్గట్లుగానే ప్రజలకు సేవలందించాలని సూచించారు.