వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో అడ్తిదారులు నిరసన వ్యక్తం చేశారు. తమకు రూ.10 కోట్ల వరకు చెల్లించాల్సిన మార్కెట్లోని మిర్చి వ్యాపారులు బిల్ల నాగేందర్, ఉపేందర్ ఇంటికి తాళం వేసి కనపడకుండా వెళ్లిపోయారని మార్కెటింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
సుమారు రెండు గంటలపాటు మార్కెట్లో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు నిలిపివేశారు. ఈ విషయాన్ని మార్కెటింగ్ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఆడ్తిదారులకు వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మద్దతు తెలిపింది.