సీఎం కేసీఆర్ చొరవతోనే రామప్పకు యునెస్కో గుర్తింపు
కాకతీయుల గొప్పదనాన్ని చాటేందుకే చెరువుల పునరుద్ధరణ పథకానికి ‘మిషన్ కాకతీయ’ పేరు
రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి రామప్ప సందర్శన
ఆలయంలో ప్రత్యేక పూజలు
వెంకటాపూర్, జూలై 26 : రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు కోసం తెలంగాణ ఉద్యమ కాలం నుంచే నాటి ఉద్యమ నేత, నేటి సీఎం కేసీఆర్ కృషి చేశారని, ఆయనకు జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన సందర్భంగా రుద్రేశ్వర స్వామివారిని మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సోమవారం సీతక్క దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణను మొత్తం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ కాకతీయుల అద్భుత శిల్ప కళ తెలంగాణలో ఉందని, ఈ ప్రాంత ప్రజలు, రైతుల కోసం కాకతీయులు కట్టిన చెరువులను బాగు చేసేందుకు, వారి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటేందుకే చెరువుల పునరుద్ధరణ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ‘మిషన్ కాకతీయ’ పేరు పెట్టారని గుర్తు చేశారు. రామప్పకు ప్రపంచ స్థాయి గుర్తింపు రావడంపై జిల్లా బిడ్డలు గర్వపడాలని, యునెస్కో గుర్తింపుతో రామప్ప ఆలయం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రామప్పకు యునెక్కో గుర్తింపు రావడంలో పాండురంగారావు, పాపారావు, ముఖ్యంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు ఆలయ పరిసరాలను మంత్రులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఆలయంలో కేక్కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. యునెస్కో గుర్తింపుపై మంత్రి పర్యాటకుల అభిప్రాయం కోరగా.. వాళ్లు ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
రామప్ప చెరువు వద్ద మత్తడి ప్రాంతానికి వెళ్లి చెరువు ఇన్ఫ్లో, అవుట్ ఫ్లోను మంత్రి పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులుతో వివరాలు తెలుసుకుని వరద నియంత్రణ కోసం వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక్కడ జడ్పీ అధ్యక్షుడు కుసుమ జగదీష్, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్రావు, వికలాంగుల అభివృద్ధి చైర్మన్ వాసుదేవారెడ్డి, కూడ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రైతు రుణ విమోచన సమితి చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ యేరువ సతీశ్రెడ్డి, కలెక్టర్ కృష్ట ఆదిత్య, ఏఎస్పీ సాయిచైతన్య, డీఆర్వో రమాదేవి, ఎంపీపీలు బుర్ర రజిత సమ్మయ్య, గండ్రకోట శ్రీదేవి సుధీర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పోరిక విజయరాం నాయక్, డీసీసీబీ డైరెక్టర్ మాడుగుల రమేశ్, నాయకులు పోరిక గోవింద్నాయక్, సర్పంచ్లు డోలి రజిత, సుచరిత, అశోక్, గట్టు కుమారస్వామి, జగన్మోహన్రావు, మండలాధ్యక్షుడు రామాచారి, బాదం ప్రవీణ్, ఆకిరెడ్డి రామ్మోహన్రావు, సత్యనారాయణస్వామి, శ్రీనివాస్, రత్నాకర్ పాల్గొన్నారు.