వరంగల్, అక్టోబరు 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;‘టీఆర్ఎస్కు వరంగల్ మొదటి నుంచీ సెంటిమెంట్. పార్టీ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్లోనే తెలంగాణ విజయగర్జనసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినం. ఇక్కడ టీఆర్ఎస్ ఏ సభ పెట్టినా సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా విజయవంతం చేసే బాధ్యత ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులదే.. ప్రతి ఊరి నుంచి ప్రజలు తరలివస్తరు.. ఏర్పాట్లు ఘనంగా చేయాలె.. అందరి కంటే ముందు వరంగల్ ఉమ్మడి జిల్లా వాళ్లే రావాలె.. విజయగర్జన సభను దేశమంతా చర్చించుకునేలా నిర్వహించుకుందా’మని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ సంస్థాగత బలోపేతం, పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభం, ప్లీనరీ, విజయగర్జన సభ, ప్రభుత్వం- పార్టీ వ్యవహారాల సమన్వయం వంటి అంశాలపై హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, వరంగల్ పశ్చిమం, మహబూబాబాద్, డోర్నకల్, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్యనేతలతో శుక్రవారం సమావేశమయ్యారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, బానోత్ శంకర్నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సారథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి తరలివెళ్లిన ముఖ్య నేతలకు రామన్న దిశా నిర్దేశం చేశారు.
వరంగల్ అంటే టీఆర్ఎస్కు మొదటి నుంచీ సెంటిమెంట్ అనీ, అందుకే పార్టీ ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహించే ‘తెలంగాణ విజయ గర్జన సభ’ను వరంగల్లోనే నిర్వహించాలని నిర్ణయించామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, జిల్లా కార్యాలయాల ప్రారంభం, ప్లీనరీ, విజయగర్జన సభ విజయవంతం కోసం ఏర్పాట్లు, ప్రభుత్వం-పార్టీ వ్యవహారాల సమన్వయం తదితర అంశాలపై హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, మహబూబాబాద్, డోర్నకల్, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్యనేతలతో శుక్రవారం సమావేశమయ్యారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, బానోత్ శంకర్నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సారథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి తరలివెళ్లిన ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేశారు. ‘ ఇక్కడ టీఆర్ఎస్ ఏ సభ పెట్టినా సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా విజయవం తం చేసే బాధ్యత ఉమ్మడి వరంగల్ జిల్లా నా యకులదే.. ప్రతి ఊరి నుంచి ప్రజలు తరలివస్తరు.. ఏర్పాట్లు ఘనంగా చేయాలె..’ అని పిలుపునిచ్చారు. విజయగర్జన సభపై దేశమంతా చర్చించుకునేలా నిర్వహించుకుందామని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు.
ఎవరైనా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఉపేక్షించొద్దు
టీఆర్ఎస్పై, సీఎం కేసీఆర్పై, పార్టీ నేతలపై ఎవరైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వారిని ఇక ఉపేక్షించవద్దని రామన్న స్పష్టం చేశారు. అర్థం లేని విమర్శలు, ఆరోపణలపై గట్టిగా బదులివ్వాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేసుకునే ప్రక్రియ జరుగుతున్నదని, ఇప్పటికే గ్రామ, మండల కమిటీలు పూర్తయ్యాయని, త్వరలోనే జిల్లా కమిటీల ఏర్పాటు ఉంటుందని చెప్పారు. ఈ నెల 25న ప్లీనరీలో టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక పూర్తవుతుందని, ఆరు వేల మంది ప్లీనరీకి హాజరవుతారని చెప్పారు. ప్లీనరీతో పాటు విజయగర్జన సభకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలన్నారు. ఇందుకోసం శనివారం అన్ని గ్రామాల్లో, ఆదివారం మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ నెల 27న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేరోజు సమావేశాలు ఏర్పాటు చేయాలని, విజయగర్జన సభ కోసం ప్రతి గ్రామంలోని కార్యకర్తలను, నాయకులను సిద్ధం చేయాలని కేటీఆర్ చెప్పారు. విజయగర్జన సభ తర్వాత అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించుకుందామన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో అందరికీ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు.
టీఆర్ఎస్కు రాజకీయ పార్టీగా గొప్ప ప్రస్థానం ఉంది.. దేశంలో చాలా రాజకీయ పార్టీలు కాలగమనంలో కలిసిపోయాయి. కొన్ని పార్టీలే మనుగడ సాగించాయి. వాటిలో టీఆర్ఎస్ ఒకటి. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన టీఆర్ఎస్, కొత్త రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడంలోనూ అంతే అంకిత భావంతో పని చేసింది. గత ప్రభుత్వాలు కనీసం ఆలోచన కూడా చేయని పథకాలను టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్నది. మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఎక్కడా లేవు. ప్రభుత్వ పథకాలపై టీఆర్ఎస్ కార్యకర్తలకు పూర్తి అవగాహన ఉండాలి. గ్రామాల వారీగా లబ్ధిదారుల వివరాల నివేదికలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. రైతుబంధు, ఆసరా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్.. ఇలా అన్ని పథకాల లబ్ధిదారుల వివరాలు ఉండాలి. ప్రభుత్వం, పార్టీ తరఫున గట్టి వాదన వినిపించాలి’ అని కేటీఆర్ సూచించారు. ఈ సమావేశాల్లో జడ్పీ అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు .
హాస్టల్ విద్యార్థులకు అసౌకర్యం కలుగొద్దు
డోర్నకల్/గార్ల : హాస్టల్ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగొద్దని ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం డోర్నకల్, గార్ల మండలాల్లోని కస్తూర్బాగాంధీ (కేజీబీవీ) బాలికల విద్యాలయాలను తనిఖీ చేశారు. పాఠశాల తరగతి గదులు, ఆవరణ, వంట గది, డైనింగ్హాల్, వాటర్ ప్లాంట్ను పరిశీలించారు. పాఠశాలలో సిబ్బంది శానిటేషన్ చేశారా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలన్నారు. తల్లిదండ్రులకు సమాచారం అందించి ప్రతి విద్యార్థి పాఠశాలకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. అందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాబోధన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ ఎస్ఆర్జీ ప్రభాకర్ రెడ్డి, డోర్నకల్ మండల విద్యాశాఖ అధికారి పూల్చంద్, ఉపాధ్యాయుడు సుంకరి శ్రీనివాస్, కేజీబీవీ ప్రత్యేక అధికారిణి ముని, గార్లలో ఎస్ఆర్జీ ప్రభాకర్రెడ్డి, రిసోర్స్పర్సన్ సుంకరి శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి పూల్ చంద్, పాఠశాల ప్రత్యేక అధికారి లలిత లీలా పాల్గొన్నారు.
గదులను పరిశుభ్రం చేయించాలి
నెల్లికుదురు : మండలంలోని కస్తూర్బా, మోడల్ స్కూల్లోని హాస్టల్ గదులను పరిశుభ్రం చేయించాలని ఎంఈవో గుగులోత్ రాము అన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీ, మోడల్ స్కూల్లో శుక్రవారం ఆయన సందర్శించారు. హాస్టల్ గదులను పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఏజెన్సీలను ఆదేశించారు. ఆయన వెట మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే శ్రీనివాస్, కేజీబీవీ ఎస్వో సుమలత తదితరులు ఉన్నారు.