నెక్కొండ, జూలై 22 : మొన్నటి వరకు కరోనా వ్యాక్సిన్పై సందేహాలతో ఉన్న జనం ఇప్పుడు టీకా వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. నెక్కొండలోని పీహెచ్సీలో గురువారం 150 మందికి వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని వైద్య సిబ్బంది ప్రకటించగా వందల సంఖ్యలో ఎగబడ్డారు. దీంతో పోలీస్ పహారాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది. డోసుల కొరత కారణంగా వారానికి రెండు రోజులే వ్యాక్సిన్ ఇస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది.
వర్షంలోనూ వ్యాక్సినేషన్
గీసుకొండ : మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా గురువారం మండలంలోని పీహెచ్సీలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. మరియపురం గ్రామానికి చెందిన వంద మంది గ్రామస్తులకు టీకా వేశారు. కార్యక్రమంలోమెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవీలత పాల్గొనారు.
ముందు వచ్చిన వారికే వ్యాక్సిన్
శాయంపేట : వ్యాక్సిన్ కోసం పీహెచ్సీకి ముందు వచ్చేవారికే ప్రాధాన్యం ఇవ్వాలని మండల కొవిడ్ సమన్వయ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు మండల పరిషత్లో కమిటీ సభ్యులు ఎంపీడీవో అమంచ కృష్ణమూర్తి, తహసీల్దార్ హరికృష్ణ, ట్రైనీ ఎస్సై సుమలత, వైద్యాధికారి నాగశశికాంత్ ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ కొరత కారణంగా వారానికి రెండు రోజులు మాత్రమే 300 డోసులు ఇవ్వాలని నిర్ణయించారు. కరోనా ఎక్కువగా ప్రబలుతున్న గ్రామాల వారికే వ్యాక్సినేషన్లోప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు ఎంపీడీవో కృష్ణమూర్తి తెలిపారు. అన్ని గ్రామాల నుంచి పీహెచ్సీకి వ్యాక్సిన్ కోసం ముందు చేరుకున్న వారు టోకెన్ తీసుకోవాలన్నారు. సమావేశంలో సూపరింటెండెంట్ అనురాధ