కల్హేర్, జూలై 11: రైతును రాజును చేసేందుకు సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టు అలుగు పడడంతో వృథాగా వెళ్లే నీటిని కాల్వల ద్వారా చెరువులు, కుంటలు నింపుకునేందుకు వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో రైతులు వ్యవసాయం చేయాలంటేనే భయాందోళనకు గురయ్యేవారని, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. స్వరాష్ట్రం సాధించుకొని వ్యవసాయాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు, వానకాలం, యాసంగి పంటల సాగుకు నీరందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి చరిత్ర సృష్టించారన్నారు. నియోజకవర్గంలోని రైతులకు బసవేశ్వర లిఫ్ట్తో సాగు నీరందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయన్నారు. నల్ల వాగు ప్రాజెక్టు అలుగు నుం చి కింది భాగానికి వృథాగా నీరు వెళ్తున్నాయని, ఆ నీటిని కాల్వల ద్వారా మం డల పరిధిలోని ఆయా గ్రా మాల్లోని చెరువులు, కుం టలు నింపుకోవాలని రైతులకు కోరారు. కల్హేర్ గ్రామ శివారులోని కాముని చెరువు నిండడానికి వరద నీరు తక్కువయ్యాయని ముందుగా కాముని చెరువు నింపుకునేందుకు రైతులు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో సిర్గాపూర్, కల్హేర్ జడ్పీటీసీలు రాఘవరెడ్డి, నర్సింహారెడ్డి, ఎంపీపీ మైపాల్రెడ్డి, నల్లవాగు సర్పంచ్ గంగమణి, పార్టీ మండల అధ్యక్షుడు సంజీవరావు, కృష్ణాపూర్ పీఏసీఎస్ చైర్మన్ కృష్ణాగౌడ్, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ జిల్లా సభ్యుడు రవీందర్నాయక్, నాయకులు బసం, రైతులు పాల్గొన్నారు.